అంబేడ్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ ఆదేశాల మేరకు అంబేద్కర్ స్టూడెంట్ ఫేడరెషన్ ములుగు జిల్లా కో కన్వీనర్ గా మారెపల్లి నవీన్ ను నియమించినట్లు అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ ములుగు జిల్లా కన్వీనర్ బోడ రాజు శుక్రవారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన కో కన్వీనర్ మారెపల్లి నవీన్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంద నరేష్ కు, ఎబిఎస్ఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బండి మొగిళి, ఎబిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గుంపెల్లి గౌతమ్రాజ్, ములుగు జిల్లా కన్వీనర్ బోడ రాజు కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థి సమస్యలపై నిరంతరం పోరాడుతానని అన్నారు. అంబేడ్కర్, కాన్షిరాం, పూలే సిద్దాతాల కోసం పని చేస్తానని అన్నారు.