ఉప్పల్ డివిజన్ న్యూ భరత్ నగర్ లో నీ డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం కొత్తగా డ్రైనేజీ లైన్లను నిర్మిస్తున్నట్టు కార్పొరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ జరుగుతున్న డ్రైనేజీ లైన్, వర్షపు నీటి కాలువ పై కప్పుల నిర్మాణ పనులను సోమవారం ఏఈ వసంతతో కలిసి పరిశీలించారు.
డివిజన్లోని పలు సమస్యలను త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ భరత్ నగర్ కాలనీ అధ్యక్షులు వేముల కృష్ణ రెడ్డి , గంటా మల్లారెడ్డి, S.మారుతి, ప్రవీణ్ కుమార్, సాయిగౌడ్, వేముల వీరా రెడ్డి, బండి మాధవ్ రెడ్డి, బర్ల ఐలయ్య, సల్ల రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సల్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.