నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో అనారోగ్యంతో మృతి చెందిన చింతవట్ల లింగన్న కు కొల్లాపూర్ సేవా సమితి చైర్మన్ రంగినేని అభిలాష్ రావు నివాళులర్పించారు.
చిన్నంబావి మండలం,వెంకటాంపల్లి గ్రామంలో చింతవట్ల లింగన్న గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు స్వర్గస్తులైనారు.
సోమవారం విషయం తెలుసుకున్న రంగినేని అభిలాష్ రావు వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి మనోధైర్యం ఇచ్చి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.