విజయనగరం జిల్లా వ్యాప్తంగా అర్దాంతరంగా తొలగించిన పెన్షన్లు, రేషన్ కార్డ్లు తక్షణమే మంజూరు చేయాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు అదాడ మోహనరావు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఈ మేరకు కలక్టరేట్ ముందు శాంతియుతంగా ధర్నా చేపట్టారు.అనంతరం కలక్టరేట్ గ్రీవిన్స్ లో వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాల పేరుతో అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని గుల్ల చేసే పనిలో సీఎం జగన్ ఉన్నారని, కార్పొరేషన్ నిధులను మొదలుకొని,వృద్ధుల పింఛన్లు, ఆఖరికి వికలాంగులకు కేటాయించిన నిధులను కూడా సంక్షేమ పథకాలకోసం ఖర్చు పెట్టే తీరుచూస్తుంటే జగన్ ప్రభుత్వం కూలిపోడానికి ఎంతోదూరంలో లేదని ఆరోపించారు.
జిల్లా వ్యాప్తంగా సుమారు పద్నాలుగు వేలు పైన రేషన్ కార్డులు, పెన్షన్లు వికలాంగులతో కలుపుకొని సుమారు పద్దెనిమిది వేలకు పైగా తొలగించారని, తక్షణమే తొలగించిన పెన్షన్లు, రేషన్ కార్డ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాడుతోందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
జనసేన పార్టీ సీనియర్ నేతలు దంతులూరి రామచంద్రరాజు, వంక నరసింగరావు,సాసుబిల్లి రామునాయుడు, అడబాల వెంకటేష్ నాయుడు,భాస్కర్, శ్రీను,రాజు,అప్పలనాయుడు,భారీగా జనసేన ఝాన్సీ వీరమహిళలు పాల్గొన్నారు.