మతి స్థిమితం లేని వ్యక్తి ఆకలి తీర్చిన హొం గార్డ్…!
మానవత్వం చాటుకున్న బొండపల్లి పీఎస్ ఖాకీ….! మతి స్థిమితం లేని వ్యక్తి ఆకలి తీర్చిన హొం గార్డ్…! చదివారుగా…కఠిన హృదయులైన ఖాకీలలో మానవత్వం ఉంటోందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. అన్నార్తులు,అర్ధాకలితో అలమటిస్తున్నవారికి అన్నం పెట్టేందుకు ఎన్నో ఆశ్రమాలు..మరెన్నో సత్రాలు…ఇంకెంతమందో ఉన్నారు…ఉంటున్నారు.
కానీ పోలీసు అన్న వాడు ఎప్పుడైన ఎవ్వరికైనా ఏ రకంగా అయినా సాయం చేసే సందర్భం…సమయం చూసారా..? అస్సలు వారికి కుటుంబంతో గడిపే సమమే ఉండని పక్షంలో ఇంకసేవ ఏంటి అని అనుకుంటున్నారా.? మనస్సు పెడితే….కఠిన హృదయలైన ఖాకీలు కూడా…పరోప కారం చేస్తారు.
అందుకు ఉదాహరణే ఏపీలోని జిల్లాలోని గజపతినగరం పోలీస్ సర్కిల్ లో బొండపల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న హొం గార్డ్ బంగారు నాయుడు. ఇతగాడు రోడ్ సేప్టీ మొబైల్ డ్రైవర్. బొండపల్లి పీఎస్ పరిధిలో సీఐ రమేష్ సూచనలు..ఎస్ఐ వాసుదేవ్ ఆదేశాలతో తన రోడ్ సేప్టీ మొబైల్ కు కేటాయించిన సిబ్బందిని నిర్దేశించిన గమ్యస్థానికి తీసుకెళ్లడం ఇతగాని విధి.
ఆ రకంగానే విధులు నిర్వహిస్తున్న బంగారు నాయుడుకు బొండపల్లి స్టేషన్ సమీపంలో…బోడసింగి పేట పెట్రోల్ బంక్ వద్ద గడిచిన కొద్ది రోజుల నుంచీ ఓవ్యక్తిని చూడటం గమనించ సాగాడు. అతగాని మతిస్థిమితం లేదని…ఆకలిలో అలమటిస్తున్నాడని హోం గార్డు బంగారు నాయుడు గ్రహించాడు.
అంతే తాను విధుల్లో ఉన్నప్పుడు కాని..కాస్త సమయం దొరికినా…కాని..ఆ మతిస్థిమితం లేని వ్యక్తికి అన్నం పెట్టాలనుకున్నాడు. అంతే అనుకున్నతడవు ఆచరణలో పెట్టి…గడచిన పది రోజుల నుంచీ తన స్వంత ఖర్చులతో ఆ మతిస్థిమితం లేని వ్యక్తి కడుపు మంటను చల్లార్చేయత్నం చేస్తున్నాడు.ఈ చర్యతో తనకున్న దాంట్లో కొంతైనా సాటి మానవునికి సాయం పడాలన్న సూక్తిని ఆచరించి..శభాష్…హోం గార్డ్ బంగారు నాయుడా అని పించుకున్నాడని అ్ంటోంది.. సత్యం న్యూస్.నెట్.