ప్రొద్దుటూరులో టిడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యాడు. సోములవారిపల్లె పోలాల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైఎస్ ఆర్ జగనన్న కాలనీలో ఈ హత్య జరిగింది.
ప్రత్యర్దులు నందం సుబ్బయ్య కళ్లలో కారం కొట్టి వేట కొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. గత వారం రోజులుగా నందం సుబ్బయ్య ప్రొద్దుటూరు వైసిపి నేతలపైన, ఎమ్మెల్యేపైన వరుసగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.
సోషియల్ మీడియా వేదికగా ఆయన చేసిన విమర్శలపై వాగ్వివాదం జరుగుతున్న నేపథ్యంలో మరి కొన్ని గంటల్లో కలెక్టర్ చేతుల మీదుగా ఇదే హత్యజరిగిన స్థలంలోనే ప్రజలకు ఇల్ల పట్టాలు ఇవ్వనున్నారు.
హత్య జరిగిన సమయంలో మున్సిపల్ అధికారులు, సభ ఏర్పాట్లలో ఉన్నారు. రెండు వాహనాల్లో నందం సుబ్బయ్యను వెంబడించి హత్య చేసినట్లు తెలుస్తోంది.
అయితే హత్యకు దారి తీసిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలాని చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.