శవాలపై పేలాలు ఏరుకున్న చందంగా వరద బాధితుల సాయంలోనూ కమీషన్లు దండుకున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
మీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులను చూస్తే వీళ్లు మనుషులేనా, మానవత్వం ఉందా అనిపిస్తోంది. గ్రేటర్లో ఓట్లు దండుకోవాలన్న మీ దుర్భుద్ధే ఈ స్కాంకు కారణం.
చిత్తశుద్ధి ఉంటే పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాల్లో వేసేవారు. మీ అత్యుత్సాహం వల్ల పరిహారం నిలిపేయాల్సిన పరిస్థితి. రెండు రోజుల్లో తిరిగి పరిహారం పంపిణీ మొదలు పెట్టాలి.
ఇప్పటి వరకు జరిగిన దోపిడీపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి’ అని రేవంత్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు.