బీజేపీని ఆశీర్వదించండి… బండి సంజయ్ యాత్రకు మద్దతివ్వండి: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి
ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్బంగా గద్వాల జోగులాంబ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన రెండో దఫా ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించారు. రాత్రి అక్కడే బస చేసిన ఆయన రెండో రోజు యాత్ర ప్రారంభించారు.ఈ రెండో రోజుయాత్రకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హజరై…కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని..బీజేపీ రావడం ఖాయమని పలుకుతూ…బండి సంజయ్ చేపట్టిన యాత్రకు మద్దతు ఇవ్వాలంటూ మాట్లాడారు.
ఇంకా కేంద్ర మంత్రి ఏం మాట్లాడారంటే…బీజేపీ అధికారంలోకి వస్తే నీతివంతమైన ప్రజాస్వామిక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనపట్ల విసిగిపోయారని. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పోవడం…. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.. టీఆర్ఎస్ అవినీతి-నియంత-కుటుంబ పాలనను ఎండగడుతూ ప్రజా సమస్యలను తెలుసుకుని వారి పరిష్కారం కోసం పోరాడేందుకే ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరిట పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కు మద్దతు పలకాలని కోరారు.
జోగులాంబ గద్వాల్ జిల్లాలో రెండోరోజు పాదయాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, బండి సంజయ్ ఇమాంపేట నుండి లింగన్ వాయి మీదుగా బూడిదపాడు సెంటర్, ఉండవల్లి వరకు నడిచారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణసహా పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నేతలు పాదయాత్రలో నడిచారు.
అనంతరం లింగన్ వాయి గ్రామంలో ‘ప్రజల గోస-బీజేపీ భరోసా’ పేరిట నిర్వహించిన రచ్చబండలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కరోనా కాలంలో ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. గ్రామాల్లోని పేద ప్రజల ప్రాణాలు కాపాడేందుకు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందించడంతో పాటు ఔషధాలు ఇస్తోందన్నారు.
పేదలకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇస్తోంది … గ్రామాలకు దూరంగా జీవనం సాగిస్తున్న పేదలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది…. ప్రతి ఇంట్లో మహిళలకు పొగబారిన బతుకుల నుంచి విముక్తి కోసం గ్యాస్ కనెక్షన్లు ఇస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.పేద ప్రజలకు అండగా ఉండాలని పీఎం మోడీ ఏడాదికి . 5లక్షల విలువైన ఆయుష్మాన్ భారత్ పథకం తీసుకొస్తే… దానికి కేసీఆర్ సర్కారు మోకాలడ్డుతోందని..అలాగే రైతుల కోసం సమగ్రమైన పంట బీమా పథకం తీసుకొస్తే దాన్నీ కూడా అడ్డకుంటున్నారని కిషన్ రెడ్డి అన్నారు.
నిజాయితీ పార్టీ రావాలన్నా, ప్రజాస్వామ్య పాలన రావాలన్నా…. కుటుంబ, నిజాం నియంతృత్వ పాలన పోవాలన్నా… భారతీయ జనతా పార్టీ రావాలని… మహబూబ్ నగర్ జిల్లా సశ్యశ్యామలం కావాలంటే భారతీయ జనతా పార్టీ రావాల్సిందేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేసారు. బీజేపీని ఆశీర్వదించండి… సంజయ్ కు మద్దతు తెలపండి అని పలుకుతూ కిషన్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.