వంటల బీమా పథకాన్ని అమలు చేయాలని రైతులందరికీ రైతు బంధు ఇవ్వడంతో పాటు ఇప్పటి వరకు ఉన్న వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 21న ఉదయం 10 గంటలకు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను అందజేయాలని వారు కోరారు. గ్రీన్ఫిల్డ్ నేషనల్ హైవే క్రింద వ్యవసాయ భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను పూర్తి స్థాయిలో రద్దు చేయలేదని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం పని చేస్తుందని వారు తెలిపారు. రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించే క్రమంలో జరుగుతున్న రైతాంగ పోరాటంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొనాలని రమేష్, గోవిందరావులు కోరారు.