కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో హెచ్ సి ఎల్ టెక్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో జాబ్ మేళాను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి షేక్ సలాం మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు ఇటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జాబ్ మేళా కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి నిరుద్యోగ యువతీ యువకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో నోడల్ అధికారి తో పాటు ప్రిన్సిపాల్ నరేందర్, కళాశాల అధ్యాపక బృందం, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజ్, పటేల్ డాక్టర్ రాజు, హెచ్ సి ఎల్ టెక్ లిమిటెడ్ ఏరియా ప్రతినిధులు రాజేష్ కుమార్, పవన్ తదితరులున్నారు.
జి లాలయ్య సత్యం న్యూస్ రిపోర్టర్ జుక్కల్ నియోజకవర్గం