కరీంనగర్ కు పర్యాటక శోభ తీసుకురాబోతున్న తీగల వంతెన ప్రారంభానికి ముందే షూటింగ్ స్పాట్ గా మారిపోయింది. కళల కాణాచి అయిన కరీంనగర్ కు చెందిన కళాకారులు తమకు మరో షూటింగ్ స్పాట్ రాబోతుందని సంబరపడి పోతున్నారు. ఈ నేపథ్యంలో తుది మెరుగులు దిద్దుకుంటున్న తీగల వంతెన పై అపుడే షూటింగ్ లు తీయడం ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో నిర్మితమవుతున్న కామిడీ ఓరియంటెడ్ మూవీ కి సంబంధించిన కొంత మేరకు షూటింగ్ శనివారం జరిగింది. హీరో హీరోయిన్ల పై పాటను చిత్రికరించే పనిలో సినిమా యూనిట్ నిమగ్నమై ఉంది.
గతంలో షూటింగ్ అంటే హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాలను దర్శకులు వెతికేవారని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరువతో కరీంనగర్ పర్యాటకంగా రూపుదిద్దుకోవడంతో.. చిత్ర పరిశ్రమ మొత్తం కరీంనగర్ వైపు చూస్తుంది. ఈ చిత్రంలో హీరోగా కమెడియన్ సత్యం రాజేష్ హీరోయిన్లుగా సునీత , రియా నటిస్తున్నారు