చిన్నంబావి మండలం అయ్యవారి పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకట్ రాం రెడ్డి అనారోగ్యానికి గురై మృతి చెందారు. బుధవారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులైన సిద్ధిపేట ఎఎస్పీ నరసింహ రెడ్డిని పరామర్శించి కుటంబ సభ్యులకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తో పాటు మండల ఎంపీపీ సోమేశ్వరమ్మ, జడ్పీటీసీ వెంకట్రామమ్మ, సింగిల్ విండో చెర్మెన్ శ్రీధర్ రెడ్డి, TRS పార్టీ నాయకులు వున్నారు.
previous post
next post