40.2 C
Hyderabad
May 2, 2024 16: 17 PM
Slider మహబూబ్ నగర్

అంబేద్కర్ విగ్రహాన్ని తగులబెట్టిన వారిని కఠినంగా శిక్షించాలి

#malachaitanyasamithi

అంబేద్కర్ విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టిన దుండగులను తక్షణమే అరెస్టు చేసి వారిపై రాజద్రోహం కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మాలల చైతన్య సమితిరాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలే కేశవులు డిమాండ్ చేశారు.

జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం ఇరికి చెడు గ్రామంలో పోలీసుల సమక్షంలోనే ఈ విధ్వంసం జరిగిందని ఆయన అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని చౌరస్తా లో కాకుండా  గ్రామంలో దూరంగా ఒక సైడ్ కు పెట్టాలని ఆ గ్రామానికి చెందిన అంబేద్కర్ వ్యతిరేకులు ఈ కార్యక్రమానికి పాల్పడ్డారని ఆయన అన్నారు.

అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చిన ఫలాలు అనుభవిస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీలు అగ్రకుల నాయకులు తొత్తులుగా మారి ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అంబేద్కర్ గారు అందరివాడు అని ఈ దేశంలో ఉన్న అణగారిన ప్రజలు ఆలోచన చేయాలని తెలియజేస్తూ ఈ సంఘటనపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అయినా అంబేద్కర్ వారసులు ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు.

దుండగులను వెంటనే అరెస్టు చేయకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని మాల ల చైతన్య సమితి హెచ్చరిస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాలల చైతన్య సమితిరాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలే కేశవులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రామదాస్ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు అల్లా పాటి నరసింహులు పాల్గొన్నారు.

Related posts

ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు పక్డబందీగా నిర్వహించాలి

Satyam NEWS

పేద బ్రాహ్మాణ కుటుంబాలకు బియ్యం పంపిణీ

Satyam NEWS

మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం

Satyam NEWS

Leave a Comment