పవిత్ర ఆలయంలో క్షుద్రపూజలు జరిపితే? ఆ క్షుద్ర పూజలకు ఆలయ సిబ్బందే సహకరిస్తే? ఇలాంటి ఘోరం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి సమీపంలోని వేడంలో కొలువైన కాలభైరవ ఆలయంలో జరిగింది. కొంతమంది తమిళులు కాలభైరవ ఆలయంలో క్షుద్రపూజలను నిర్వహించడం తీవ్ర కలకలం రేపింది. ఈ పూజలకు ఆలయ సెక్యూరిటీ గార్డులు సహకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. క్షుద్రపూజల సంగతిని తెలుసుకున్న పోలీసులు ఐదుగురు తమిళనాడు వాసులను అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారంలో శ్రీకాళహస్తి ఏఈవో ధనపాల్ ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆలయ సెక్యూరిటీ గార్డులు పోలీసులు వస్తున్న సమచారం తెలుసుకుని పరారయ్యారు. దాంతో పరారీలో ఉన్న ఆలయ సెక్యూరిటీ గార్డుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
previous post