29.7 C
Hyderabad
May 21, 2024 23: 42 PM
Slider ఖమ్మం

21 రోజుల లోపు అనుమతులను జారీచేయాలి

#khammam

లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా  మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఖమ్మం, నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి లే అవుట్ అప్రూవల్ కమిటీ సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ, సుడా పరిధిలో లే-అవుట్ ఆమోదం కొరకై అందిన 22 దరఖాస్తులను కమిటీ సమావేశంలో పరిశీలించారు. నిబంధనల మేరకు సమర్పించబడిన దరఖాస్తులను కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో లే-అవుట్ల ఆమోదం కొరకు రెవెన్యూ, విద్యుత్, నీటి పారుదల, రోడ్లు భవనాల, టౌన్ ప్లానింగ్ తదితర అనుబంధ శాఖల నుండి అనుమతులకై సమర్పించిన దరఖాస్తులను 21 రోజుల లోపు ఆయా శాఖలకు సంబంధించిన అనుమతులను జారీచేయాలని, తదనుగుణంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమోదించడం జరుగుతుందని అన్నారు. గ్రీనరీ కొరకు కేటాయించిన స్థలాన్ని వెంటనే స్వాధీనపర్చుకొని మొక్కలు నాటాలన్నారు.

అనుమతులు జారీకి సంబంధిత శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన పిదపనే అనుమతులు జారీచేయాలని కలెక్టర్ సూచించారు. లేఅవుట్ డెవలపర్స్ కూడా నిబంధనల మేరకు చట్టబద్దంగా సమగ్ర ప్రణాళిక ల్యాండ్ డెవలప్మెంట్ పనులు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఇరిగేషన్ సిఇ శంకర్ నాయక్, జెడ్పి సిఇఓ అప్పారావు, రెవిన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాధ్, పంచాయితీ రాజ్ ఇఇ శ్రీనివాస్, మధిర మునిసిపల్ కమీషనర్ రమాదేవి, డిసిటీఓ వికాస్, ఖమ్మం అర్బన్ రూరల్, తహశీల్దార్లు శైలజ, సుమ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

అసంపూర్తిగా కాలువ నిర్మాణం

Satyam NEWS

మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ దుర్మరణం

Satyam NEWS

ప్రభుత్వ ఉద్యోగులపై ఉక్రోషం చూపిస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment