వనపర్తి పట్టణంలో ఓల్డ్ యూకో బ్యాంక్ క్రాసింగ్ దగ్గర మురికి కాలువ నిర్మాణం అసంపూర్తిగా ఉంచడం వల్ల సిజినల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కౌన్సిలర్ బండారు కృష్ణ చెప్పారు. మురికి నీరు కాలువలో ముందరికి పోవడానికి అవకాశం లేదని ఆయన తెలిపారు. 15వ వార్డులో దోమల వల్ల డెంగీ, మలేరియా వచ్చే ప్రమాదం ఉందన్నారు. కాలువ నిర్మాణంపై గత ఆరు నెలల నుండి మున్సిపల్ అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని కాంట్రాక్టర్ పేరు చెప్పి దాటవేస్తున్నారని ఆయన చెప్పారు. కాలువ నిర్మాణం పూర్తి చేయకుండా, నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని అయన కోరారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్