పోలీస్ శాఖ గౌరవం ప్రజలలో మరింత పెంచేలా, బాధితులకు న్యాయం అందించేలా పని చేయడం ద్వారా ప్రజల అభిమానం పొందాలని నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ అన్నారు. గురువారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్స్ గా పని చేస్తూ ఏ.ఎస్.ఐ.లుగా పదోన్నతి పొందిన ఎస్.రామయ్య, ఇ. వెంకట్ రెడ్డి, టి. రాజాలను అభినందించారు.
పదోన్నతి ద్వారా బాధ్యత మరింత పెరుగుతుందని, ప్రజలకు సమర్ధవంతంగా సేవలందించడం ద్వారా పోలీస్ శాఖ గౌరవం పెరిగేలా పని చేయాలని జిల్లా ఎస్పీ అన్నారు. పోలీస్ అధికారులి తమకు లభించిన పదోన్నతిని మరింత సమర్ధవంతంగా ప్రజలకు సేవ చేసే విధంగా, అనేక రకాల సమస్యలతో పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు న్యాయం అందిస్తూ మంచి పేరు పొందాలని సూచించారు.
ప్రజాభిమానం పొందేలా పని చేస్తూ ముందుకు సాగాలని, తద్వారా పోలీస్ శాఖ గౌరవాన్ని ప్రజలలో మరింత పెంచేలా విధి నిర్వహణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య తదితరులున్నారు.