గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా కలసికట్టుగా పనిచేసి ఉప్పల్ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ స్పష్టం చేశారు. బండారి లక్ష్మారెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నట్లు బొంతు శ్రీదేవి యాదవ్ తెలిపారు. బుధవారం చర్లపల్లి లోని తన నివాసంలో ఏర్పాటు చేసినా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. బి ఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన ఉప్పల్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపిస్తామని వారు తెలిపారు. గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా కలసికట్టుగా పనిచేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా