32.2 C
Hyderabad
May 21, 2024 11: 38 AM
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ పోలీసు కార్యాలయంలో ప్రజావాణి

నాగర్ కర్నూల్ జిల్లా పోలీసు కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 5 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా ఎస్పీ కె మనోహర్ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిర్యాదు దారులతో ఆయన స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ర్యాదు దారుల సమస్యలు సంబంధిత పోలీసు అధికారులు తీర్చాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. నేడు ప్రజావాణి కార్యక్రమంలో పాత కేసు విచారణ గురించి విన్నపాలు రెండు వచ్చాయి. డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదు అని ఒక ఫిర్యాదు అందింది. అదే విధంగా ఇద్దరి మధ్య గొడవలకు సంబంధించిన కేసులు రెండు వచ్చాయి.

Related posts

ఇక్కడే తెలుగు బోధించకపోతే మరెక్కడ చెబుతారు?

Satyam NEWS

బిసిల టికెట్లు అమ్ముకున్న రేవంత్ రెడ్డి

Satyam NEWS

కేసీఆర్… నీకు రాజ‌కీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌ ను అవ‌మానించొద్దు…

Satyam NEWS

Leave a Comment