నాగర్ కర్నూల్ జిల్లా పోలీసు కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 5 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా ఎస్పీ కె మనోహర్ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిర్యాదు దారులతో ఆయన స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ర్యాదు దారుల సమస్యలు సంబంధిత పోలీసు అధికారులు తీర్చాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. నేడు ప్రజావాణి కార్యక్రమంలో పాత కేసు విచారణ గురించి విన్నపాలు రెండు వచ్చాయి. డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదు అని ఒక ఫిర్యాదు అందింది. అదే విధంగా ఇద్దరి మధ్య గొడవలకు సంబంధించిన కేసులు రెండు వచ్చాయి.
previous post