తుంగతుర్తి మండల రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని సంఘo సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎన్. సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని తాటిపాముల ప్రాథమిక ఠశాలలో సంఘo మండల కార్యదర్శి బనువరి నర్సయ్య – సునీత దంపతులు దాతలుగా ఇచ్చిన టై, బెల్ట్, బ్యాడ్జీలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేసిన మంచి పనులే ప్రజల మనసులో కలకాలం లిచిపోతాయని తెలిపారు. విద్యార్థులకు అందించిన చిన్నపాటి వస్తువైన వారు పెద్దయ్యేవరకు జ్ఞాపకం ట్టుకుంటారని చెప్పారు.
ప్రతి పౌరుడు తనకు ఉంటున్న దాంట్లో కొంత ఇతరులకు సహాయంగా అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. శ్రీనివాస్, ఆ సంఘo రిటైర్డ్ విద్యాధికారి టి. కృష్ణమూర్తి, గ్రామ సర్పంచ్ ఎర్ర శోభ,ఎస్ఎంసి చైర్మన్ ఎర్ర సుధాకర్, జిల్లా జాయింట్ సెక్రెటరీ మందడి పద్మా రెడ్డి, మండల కార్యదర్శి ఎస్.నాగేశ్వరరావు, టి లక్ష్మీకాంతరెడ్డి,కె.సురేందర్ రెడ్డి,మండల శాఖ అధ్యక్షులు జి.సుదర్శన్ రావు, కోశాధికారి పి. సత్యనారాయణ వి. నర్సయ్య, ఎం.సుజాత, కె. కృష్ణమాచారి, మద్దూరి రాములు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.