ఆయన పెదవేగి మండల పరిషత్ అభివృద్ధి అధికారి. అంతేకాదు ఆయన కు సంబంధించి న విధులను నూటికి నూరు శాతం అంకిత భావంతో నిర్వహించే నిరంతర సేవా తత్పరుడు. పెదవేగి మండల అధికారులకు ఆయనో ఆదర్శ ప్రాయుడు. మండల పరిధిలో ఉండే గృహ, త్రాగునీరు, విద్య, వైద్య, వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల, రహదారులు,
పంచాయతీల పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం, పారిశుధ్యం, అంగన్వాడీ వంటి బహుళ శాఖలపై అపార అవగాహన కలిగిన మల్టిపుల్, ప్లెక్సీబుల్ అధికారి గా పేరున్న పెదవేగి ఎం డి ఓ గంజి రాజ్ మనోజ్. 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఎం డి ఓ గా ఏలూరులో గురువారం అవార్డ్ అందుకున్నారు. ఎం డి ఓ రాజ్ కుమార్ ను పలువురు జిల్లా అధికారులు అభినందించారు.
రాజ్ కుమార్ ఉత్తమ ఎం డి ఓ గా 7 సార్లు అవార్డ్ అందుకుని తన ప్రతిభను జిల్లా స్థాయిలో చాటుకుంది చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆయన విధులు నిర్వహించే పెదవేగి మండలం లో కూడా సచివాలయాలలో విధులు నిర్వహించే 20 మంది సిబ్బందికి ఉత్తమ అవార్డ్ లు రావడం వెనుక ఎం డి ఓ రాజ్ మనోజ్ కృషి ఉంది.