74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ములుగు జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో జిల్లా కలెక్టర్ యస్. కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తో కలసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు బాసాని లక్ష్మీనారాయణ ను సన్మానించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇటీవల జిల్లా ఉద్యోగులకు నిర్వహించిన ఆటల పోటీలు గెలుపొందిన విజేతలకు కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ గౌస్ ఆలం, ఏ ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ రెవిన్యూ వైవి గణేష్ , ఆర్డీవో రమాదేవి, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ములుగు