అన్నమయ్య రాయచోటి జిల్లా సుండుపల్లె మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సోమవారం ఆర్భాటంగా ప్రారంభం అయ్యింది.ఈ కార్యక్రమానికి టిడిపి శ్రేణులు దాదాపు రెండు వేల మందికి పైగా టిడిపి సైనికులు హాజరయ్యారు.ముఖ్య అతిదులుగా రాజంపేట టిడిపి అసెంబ్లీ అభ్యర్థి బత్యాల చెంగల రాయుడు, టిడిపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి,రాష్ట్ర టిడిపి నాయకులూ హరి ప్రసాద్, రాయ చోటి మాజీ మున్సిపల్ చైర్మన్ సుగవాసి సుబ్రహ్మణ్యం, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు మండల ఇంచార్జిలు పార్లమెంటరీ పార్టీ నాయకులు, ఆరు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.వచ్చే ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా బత్యాల చెంగల రాయుడుని గెలిపించుకుని, చంద్ర బాబు నాయుడు ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వక్తులు సభా ముఖంగా ధీమా వ్యక్తంచేశారు.
previous post