40.2 C
Hyderabad
April 28, 2024 17: 08 PM
Slider వరంగల్

జనగామ జిల్లా వెల్దండలో మర్కజ్ కలకలం

khajamia

నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో జరిగిన కార్యక్రమానికి హాజరై వచ్చిన ఎండి ఖాజామియాను జనగామ పోలీసులు గుర్తించారు. దాంతో జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన అతడిని ఐసోలేషన్ కు తరలించారు. ఖాజామియా ఈ నెల 13వ తేదీ నుండి 15 వ తేదీ వరకు మర్కజ్ ప్రార్ధన మందిరం సభకు హాజరయ్యాడు. ఈ నెల 18న కాజీపేట కు చేరుకొని స్వగ్రామమైన జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ కు చేరుకున్నాడు.

ఖాజామియా మటన్ వ్యాపారి, ఇతను అక్కడి నుంచి వచ్చిన తరువాత రెండు సార్లు మటన్ కొట్టి అమ్మడు. దీంతో వెల్దండ గ్రామంలోని  మటన్ తీసుకున్న వారందరికీ హోం క్వారయింటెన్లో ఉండాలని 35 మంది పైగా ఇండ్లకు నోటీసులు జారీ చేశారు. వెల్దండ గ్రామ ప్రజలు ఈ సంఘటనతో భయబ్రాంతులకు గురై ఇండ్లల్లోంచి బయటకి వెళ్లడం లేదు.

Related posts

వేసవి లో కూడా తాగునీటి కొర‌త రానివ్వ‌కుండా చూస్తాం

Satyam NEWS

సుశాంత్ ఆత్మహత్యతో హీరోయిన్ రియాపై కేసు

Satyam NEWS

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రధమ ప్రాధాన్యం

Satyam NEWS

Leave a Comment