ఇంద్రకీలాద్రి పై వెలసిన కనకదుర్గ అమ్మవారిని మంత్రి రోజా కుటుంబ సమేతంగా నేడు దర్శించుకున్నారు. మంత్రి రోజా కు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం తీసుకున్నారు. ఆశీర్వచనం అనంతరం లడ్డూ ప్రసాదం, అమ్మ వారి చిత్రపటాన్ని దుర్గ గుడి ఈవో భ్రమరాంబ మంత్రి రోజాకు అందించారు.
previous post