నాగర్ కర్నూలు జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్గా యస్. మోతిలాల్ బుధవారం బాధ్యత లు స్వీకరించారు. వికారాబాద్ అదనపు కలెక్టర్ గా ఉన్న మోతిలాల్ ను ఈ నెల 20న నాగర్ కర్నూల్ జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఆయన జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ ను బుధవారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. అనంతరం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో రెవిన్యూ అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఎత్తిపోతల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు.
జిల్లా పౌరసరఫరాల నుండి ప్రజలకు పంపిణీ చేస్తే ప్రజా పంపిణీ వ్యవస్థతో పాటు జిల్లాలో వరి కొనుగోలు వ్యవస్థను సమర్థవంతంగా, అమలు పరుస్తూ… ధరణితోపాటు రెవిన్యూకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. జిల్లాను ప్రగతిపథంలో ఉంచేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్