విజయదశమి ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పథ సంచలన్ ఆదివారం ఉప్పల్ లో బైక్ ర్యాలీ నిర్వహించింది. ఆర్ఎస్ఎస్ ఉప్పల్ బాగ్ , బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ ల ఆధ్వర్యంలో ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లో విజయదశమి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పథసంచలన్ బైక్ ర్యాలీలో నాచారం శాఖ రాష్ట్రీయ స్వయం సేవకులు ఉప్పల్ మునిసిపల్ గ్రౌండ్ కు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సందర్భంగా బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో హిందూ జాతీయవాద సంస్థ ఆర్ఎస్ ఎస్ అని తెలిపారు. డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ ఈ సంస్థను మహారాష్ట్రలోని నాగపూర్ లో 1925లో విజయదశమి నాడు మొదలుపెట్టారని తెలిపారు. ప్రారంభ ప్రేరణ హిందూ క్రమశిక్షణ ద్వారా పాత్ర శిక్షణ ఇవ్వడం, భారతీయ హిందూ సమాజాన్ని రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సంస్థ భారతీయ సంస్కృతిని పౌర సమాజం విలువలను సమర్థించే ఆదర్శాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనం వెంకటేష్ ,కేశవ్, కల్కర్ని, మల్లారెడ్డి, లక్ష్మణ్, రాఘవేందర్ రెడ్డి, శ్రీశైలం గౌడ్, రణధీర్ తదితర స్వయం సేవకులు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి