36.2 C
Hyderabad
May 7, 2024 12: 46 PM
Slider ముఖ్యంశాలు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉత్సవ ర్యాలీ

#rss

విజయదశమి ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పథ సంచలన్ ఆదివారం ఉప్పల్ లో బైక్ ర్యాలీ నిర్వహించింది. ఆర్ఎస్ఎస్ ఉప్పల్ బాగ్ , బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ ల ఆధ్వర్యంలో ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లో విజయదశమి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పథసంచలన్ బైక్ ర్యాలీలో నాచారం శాఖ రాష్ట్రీయ స్వయం  సేవకులు ఉప్పల్  మునిసిపల్ గ్రౌండ్ కు పెద్ద ఎత్తున  తరలివచ్చారు.

ఈ సందర్భంగా బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో హిందూ జాతీయవాద సంస్థ ఆర్ఎస్ ఎస్ అని తెలిపారు. డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ ఈ సంస్థను మహారాష్ట్రలోని నాగపూర్ లో 1925లో విజయదశమి నాడు మొదలుపెట్టారని తెలిపారు. ప్రారంభ ప్రేరణ హిందూ క్రమశిక్షణ ద్వారా పాత్ర శిక్షణ ఇవ్వడం, భారతీయ హిందూ సమాజాన్ని రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సంస్థ భారతీయ సంస్కృతిని పౌర సమాజం విలువలను సమర్థించే ఆదర్శాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  వనం వెంకటేష్ ,కేశవ్, కల్కర్ని, మల్లారెడ్డి, లక్ష్మణ్, రాఘవేందర్ రెడ్డి, శ్రీశైలం గౌడ్, రణధీర్  తదితర స్వయం సేవకులు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

జనసేన లోకి పిల్లి సుభాష్ చంద్రబోస్?

Bhavani

ఐక్యతను చాటుతున్న కాలనీ సంక్షేమ సంఘాలు

Satyam NEWS

ఎస్వీబీసీ ఛానల్ పై సమీక్ష

Murali Krishna

Leave a Comment