26.7 C
Hyderabad
May 21, 2024 07: 33 AM
Slider ప్రత్యేకం

కరోనా నుంచి కోలుకున్న చంద్రబాబునాయుడు

#chandrababu

తాను కరోనా నుంచి వెంటనే కోలుకున్నానని..ప్రస్తుతం తాను పర్ఫెక్ట్ గా ఉన్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మంగళవారం బాబుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. రెండు రోజుల హోం క్వారంటైన్ అనంతరం యదావిధిగా ఆన్ లైన్ ద్వారా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు బాబు. శుక్రవారం మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కమిటీలు, కార్యక్రమాలపై బాబు చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు.

వైసీపీ పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, సీఎం జగన్ నిర్ణయాలతో అన్ని వర్గాలు నష్టపోయాయన్నారు. స్థానిక సమస్యలపై అక్కడున్న టీడీపీ నాయకత్వం పోరాటాలు పెంచాలని క్యాడర్ కు సూచించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి దారుణ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. టీడీపికి ఓటు వేశారా లేదా అనేది చర్చ కాదన్న చంద్రబాబు.. బాధిత వర్గం ఎక్కడున్నా వారికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

తమ భవిష్యత్ ఓటమిపై వైసీపీ వర్గాల్లోనే క్లారిటీ వచ్చిందని, పీఆర్సీ విషయంలో మోసపోయిన ప్రభుత్వ ఉద్యోగుల పోరాటాలకు టీడీపీ మద్దతు తెలియచేస్తుందని ప్రకటించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సమన్వయంతో కోవిడ్ బాదితులను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మీరు ఎలా ఉన్నారంటూ నేతలు ప్రశ్నించారు. కోవిడ్ నుంచి వెంటనే తాను కోలుకోవడం జరిగిందని…ఇప్పుడు బాగానే ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు.

Related posts

కొత్త కొలువులు వెతుక్కున్న పాతకాపులు

Satyam NEWS

ఫిన్ క్యాబ్ వైర్లను సందర్శించిన సిబిఐటి విద్యార్ధులు

Bhavani

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే ప్రోత్సాహకాలు

Satyam NEWS

Leave a Comment