34.2 C
Hyderabad
May 21, 2024 20: 23 PM
Slider మహబూబ్ నగర్

వీపనగండ్ల పోలీసులపై ఎస్పీకి పిర్యాదు

#Police

వనపర్తి జిల్లా వీపనగండ్ల  పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేయకుండా లాక్ ఆఫ్ ఏవిడెన్స్ పేరుతో కేసును మూసి వేశారని కల్వరాల గ్రామానికి చెందిన విలేకరి కొంతం వేణుగోపాల్ వనపర్తిలో జిల్లా ఎస్పీ అపూర్వ రావుకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ఎఫ్ఐఆర్ నంబర్ 23/2021,తేదీ 09-04-2021 ప్రకారం నిందితులను అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీకి తేదీ 13-12-2021నాడు ఫిర్యాదు చేసినా అరెస్టు చేయలేదని ,కానీ 01-02-2022 తేదీ ఉన్న లాక్ ఆఫ్ ఏవిడెన్స్ పేరుతో అప్పటి ఎస్ఐ విపనగండ్ల పోలీస్ కానిస్టేబుల్ ద్వారా  12-08-2022 నాడు వనపర్తిలో నోటీస్ తమకు ఇచ్చారని ఆయన అన్నారు. ఈ విషయమై తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్,వనపర్తి జిల్లా ప్రిన్సిపల్ జడ్జి,వనపర్తి జూనియర్ సివిల్ జడ్జికి ఫిర్యాదు చేశామని వివరించారు. మూసిన కేసు రి ఓపెన్ చేయాలని, నిందితులను అరెస్టు చేయాలని, పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

విజయనగరం లో కొనసాగుతున్న బంద్..!

Satyam NEWS

మాల మహానాడు మానకొండూరు మండల కమిటీ ఏర్పాటు

Satyam NEWS

విజయనగరం ఎస్పీ దంప‌తుల‌చే శ్రీ దేవీ దండుమారమ్మ టెంపుల్ ఉత్స‌వాలు షురూ

Satyam NEWS

Leave a Comment