మాల మహానాడు కరీంనగర్ జిల్లా సమావేశం ఆదివారం రోజున మానకొండూరు మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశానికి కన్వీనర్ కాడె శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వజి అజయ్, కో కన్వీనర్ తాళ్ల వెంకటేష్, కో కన్వీనర్ ఎలక ఆంజనేయులు, దామెర సత్యం, జిల్లా ఇంచార్జ్ ఎలుక దేవయ్య హాజరయ్యారు.
ఈ సమావేశంలో మానకొండూరు మండల కమిటీని ఏర్పాటు చేశారు. మానకొండూరు మండల అధ్యక్షుడుగా బొల్లం వెంకటస్వామి ని నియమించారు. అదే విధంగా ఉపాధ్యక్షులుగా రెడ్డ మహేందర్, మద్దెల అంజయ్య, శీలం రవీందర్ నియమితులయ్యారు. సంయుక్త కార్యదర్శిగా నీలటి మొగిలి, గాజుల మహేందర్, కోశాధికారి గా బొల్లం మహేష్, పుట్ట కిరణ్ ని నియమించారు. ప్రచార కార్యదర్శి చిలక రామస్వామి, గౌరవ సలహాదారులు గా శీలం కనకయ్య, ఎర్రల లచ్చయ్య, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా అసోద అంజయ్య, కార్యవర్గ సభ్యులు గా గడిపల్లి రవీందర్, కటెకోల్ల బిక్షపతి, మదెల లక్ష్మయ్య, తడకపల్లి నారాయణ, దాసరి అనిల్, గడ మల్ల, సుమన్, శీలం దిలీప్, బొల్లం రవి, గంజి కిషన్, అనుమండ్ల కుమార్ మండల శాఖ యూత్ అధ్యక్షులు ఎర్రల వీరేంద్ర, ప్రధాన కార్యదర్శి మాశం కిషన్ తదితరులు పాల్గొన్నారు.