ఈ నెల 4 నుంచీ ఏపీలోని కొత్తగా మరో పదకొండు జిల్లాలు ఏర్పాటు కాబోతున్న విషయం తెలిసిందే. నాల్గొ తేదీ వరకు ప్రతీ ఒక్కసిబ్బంది ఆయాజిల్లాను విడిచిఎక్కడికి వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కూడ. ఓ వైపు జిల్లాలు విడిపోతున్న వేళ… తీపిగుర్తులుగా చెరగిపోని అనుభూతులుతో శుభకృత్ నామ్ఉగాది వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్విహించుకున్నారు
. అందులో భాగంగా విజయనగరం జిల్లాలో కూడా ఉగాది ఉత్సవాలను జరిగాయి. ప్రత్యేకించి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నశ్రీ దేవీ దండుమారమ్మటెంపుల్ లో ఎస్పీ దీపికా దంపతులు నాలుగు రోజుల పాటు జరిగే ఆలయ ఉత్సవాలకు శాస్త్తోక్తంగా ప్రారంభించారు.
మొదట దండు మారమ్మ ఆలయంలో హోమంతో అయిదవ బెటాలియన్ కమాండెంట్ విక్రాంత్ పాటిల్, ఆయన భార్య జిల్లా ఎస్పీ దీపికలు..సంప్రదాయ దుస్తులతో ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉదయం 08.30 ఆలయ పూజారులు దీపికా విక్రాంత్ దంపతులను వేద మంత్రాలతో స్వాగతం పలికారు.
గర్భగుడిలో దండుమారమ్మకుదంపతులిద్దరూ పూజ చేసిన అనంతరం… ఆలయ ఆవరణలో ఆర్చకులు వేద మంత్రోఛ్చారణల నడుమ హోమం చేసారు. అనంతరం తీర్ధ ప్రసాదాఆలు తీసుకోవడమే కాక…శాఖా సిబ్బందికి ప్రసాదాన్ని పంపిణీ చేసారు.
ఈ ఉత్సవాలలో ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, అదనపు ఏఎస్పీ సత్యనారాయణరావు,దీశ డీఎస్పీ త్రినాధ్, ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు, స్పెషల్ బ్రాంచ్ సీఐలు రుద్రరాజు,చిరంజీవి,మరియన్ రాజు, శ్రీరాములు ఆలయ కమిటీసభ్యులు పాల్గొన్నారు. ఈ ఉగాది సందర్బఃంగా శాఖలో పని చేస్తున్న తొమ్మిది మందికి సేవా పతకాలను ప్రకటించారు..జిల్లా ఎస్పీ దీపిక.