శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రుని వలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఐ.డి.వి ప్రసాద్ అధ్యక్షతన సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగినది. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ స్వాతoత్రోద్యమ నాయకులలో సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక శైలిని ఎంచుకొని చురుకుగా పాల్గొన్నారన్నారు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయిని బెoడి శారద మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో సాయుధ పోరాటాన్ని ఎంచుకున్న ప్రత్యేక ధైర్య సాహసాల గల వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని, కేంద్ర ప్రభుత్వము ఆయన జన్మదినాన్ని పరాక్రమ దివస్ గా జరపాలని నిర్ణయించడం ఎంతో సమంజసం అని అన్నారు .ఈ కార్యక్రమంలో కరణం శ్రీహరి, బలివాడ ప్రభాకర్ రావు, బుడుమూరు అప్పలనాయుడు, పిసిని వసంతరావు, గండ్రేటి వినయ్ కుమార్, రాజనాల సతీష్ రాయుడు, పొన్నాన ఉషారాణి సంపతి రావు రమణమ్మ, కొణపల శ్రీనివాసరావు, కింతలి ప్రసూన, మోర అనిత బొంగు వెంకటరమణమూర్తి, నక్కిన స్వప్న, సిఆర్పి పంచి రెడ్డి మోహనరావు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
previous post