32.2 C
Hyderabad
May 21, 2024 13: 15 PM
Slider గుంటూరు

సంచార జాతుల కోసం ఎంతైనా పోరాటం చేస్తాం

#downtroddencasts

సంచార జాతుల అభివృద్ధి కమిటీ గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా అన్నప్పరెడ్డి మంగయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎంఐఎం పార్టీతో కలిసి పలు వెనుకబడిన కులాల సంఘాలు, మాల మహానాడు ఆయనకు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశo లో ఎటువంటి అభివృద్ధి కి నోచుకోని కులాలు వున్నాయి అంటే అవి సంచార జాతులే అని తెలిపారు.

ఎన్నో ప్రభుత్వలు వస్తున్నాయి పోతున్నాయి అయినా ఈ కులాల పరిస్థితులు మాత్రం మారటం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి ఆధార్ కార్డు గానీ రేషన్ కార్డు కానీ లేకపోవడం అంటే ఎంత దారుణమైన పరిస్థితి లో ఆ కులాలు ఉన్నాయో అర్ధం అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ తరుణం లో సంచార జాతుల రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. అందులో జిల్లా అధ్యక్షులు గా అన్నప్పరెడ్డి మంగయ్య ను నియమించడం శుభసూచికం అని తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు మంగయ్య మాట్లాడుతూ సంచార జాతుల కష్టాలు తెలిసిన వాడిగా న్యాయo కోసం పోరాటం చేస్తానని అన్నారు.

ప్రభుత్వం తరపున అందాల్సిన హక్కులను అందే విధంగా తన పోరాటం ఉంటుంది అని తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా వున్న సంచార జాతుల ఐక్యమత్యం కోసం కృషి చేస్తాను అని తెలిపారు. తనను జిల్లా అధ్యక్షులు గా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు అన్నప్పరెడ్డి వెంకట్ కి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఎంఐఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలి, పట్టణ అధ్యక్షులు మౌలాలి, పార్టీ సీనియర్ నాయకులు నాగూర్ అల్లాబక్షు, బిసి సంఘాల నాయకులు బదుగున్నాల శ్రీనివాస్, గురువు తిమ్మరాజు, ఐక్య వేదిక నాయకులు పొనుగుపాటి పూర్ణ చంద్రరావు, మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు గోదా జాన్ పల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

‘అన్నగారి విగ్రహంలో మీ భాగస్వామ్యం కావాలి’

Satyam NEWS

మునుగోడు లో మధు ప్రచారం

Murali Krishna

అక్రమ సంబంధం తో యువ జంట ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment