పశ్చిమగోదావరి జిల్లా లో దారుణం జరిగింది. నిడదవోలు శెట్టిపేటలో ఒకే గదిలో ఒక యువతి, ఒక యువకుడు అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందారు.
తాళం వేసి ఉన్న గదిలో యువతి, యువకుడు పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు. చనిపోయిన యువకుడిని ఏలూరు చెందిన షేక్ నాగూర్ (28) గా గుర్తించారు.
మరణించిన యువతిని నిడదవోలు మంఢలం తాళ్ళపాలెం గ్రామానికి చెందిన యామన కుసుమ నాగసాయి(30) గా గుర్తించారు.
వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం నేపథ్యంలో జరిగిన సంఘటనగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి నిడదవోలు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.