అంబర్ పేట డివిజన్ ఎంసిహెచ్ కాలనీ లో 4 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న డ్రైనేజ్ నిర్మాణ పనులను అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా డ్రైనేజ్ పనులను పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఏఈ మాజీద్, వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్,దుర్గ, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సిద్దార్థ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి జాఫర్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, స్థానిక బస్తీ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్