పేద ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఉప్పల్ ఎమ్మెల్యే పెద్ది సుభాష్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హబ్సిగూడ డివిజన్ లోని స్ట్రీట్ నెంబర్ 8 లో దీక్ష క్లినిక్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిలుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని నిర్వాహకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి ,డాక్టర్ దీక్ష రెడ్డి , వారి కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, గంగిడి కృష్ణారెడ్డి, సూరం శంకర్, స్థానిక కాలనీవాసులు మల్లారెడ్డి, ప్రదీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా