27.7 C
Hyderabad
May 14, 2024 03: 59 AM
Slider ప్రత్యేకం

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: జానారెడ్డి

#janareddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాముల శివారెడ్డి నివాసానికి విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎల్పీ నాయకుడు జానారెడ్డి ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అందరం కలిసికట్టుగా ఐక్యతతో కలిసి పనిచేయాలని,ఈ సంవత్సరం జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడం ఖాయమని,పార్టీ కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఐక్యతతో  అందరూ కష్టపడి పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి అజీజ్ పాషా,గల్లా వెంకటేశ్వర్లు,సిద్ధార్థ రెడ్డి,పాశం రామరాజు, సమ్మెట సుబ్బరాజు,ఇట్టిమల్ల బెంజిమెన్,జింజిరాల సైదులు,ముషం సత్యనారాయణ,కోల మట్టయ్య,కస్తాల ముత్తయ్య, మహమ్మద్ రజాక్ బాబా, సుదర్శన్,కొల్లూరి రాము,బంటు సైదులు,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనం కాళోజీ

Satyam NEWS

కోదాడలో జాతీయ రహదారిపై సిసి కెమెరాలు ఏర్పాటు

Satyam NEWS

సోము వీర్రాజు అభిమాని ఆత్మహత్యాయత్నంతో అలజడి

Satyam NEWS

Leave a Comment