దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు దోషుల ఉరి తీసే తేదీ ఖరారు కావడంతో.. తీహార్ జైలు అధికారులు ఉరి తీసే ఏర్పాట్లలో మునిగిపోయారు. ఈ నెల 22న ఉరి ఉండడంతో ఆ తేదీకి ముందే మాక్ ఉరి కార్యక్రమం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అప్జల్ గురును ఉరి తీసిన 3వ నంబరు జైలు గదిలో నిర్భయ దోషులకు మాక్ ఉరి కార్యక్రమం చేపట్టనున్నట్లు జైలు సూపరింటెండెంట్ చెప్పారు. ఈ మాక్ ఉరిని పీడబ్ల్యూడీ కార్యనిర్వాహక ఇంజినీరుతోపాటు జైలు అధికారులు పర్యవేక్షించనున్నారు. ఈ నెల 22న ఉదయం నలుగురు దోషులు ఉరికంబం ఎక్కనున్నారు