భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రముఖ సెమీకండక్టర్, సాఫ్ట్వేర్ సంస్థ క్వాల్కామ్ సంస్థ సీఈవో క్రిస్టియానో అమాన్తో సమావేశమయ్యారు. భారత్లో 5జీ, ప్రైమ్ మినిస్టర్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ స్కీమ్, కొత్త డ్రోన్ పాలసీ, పబ్లిక్ వైఫై సహా మరికొన్ని అంశాల గురించి చర్చించారు.
ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్, మ్యానుఫాక్చరింగ్తో పాటు భారత్లో సెమీకండక్టర్ల సప్లై చైన్ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి సమాలోచలు జరిపారు. భారత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్స్లో భారత్తో కలిసి పని చేసేందుకు క్వాల్కామ్ సీఈవో అమాన్ ఆసక్తి చూపారని, చర్చలు సఫలీకృతమయ్యాయని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.