38.2 C
Hyderabad
May 1, 2024 19: 15 PM
Slider జాతీయం

వచ్చే ఏడాది యూపీ ఎన్నికలకు అధికార బీజేపీ సమాయత్తం

యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ ​ నేతృత్వంలోని ప్రభుత్వ అభివృద్ధి పనులే అస్త్రాలుగా ముందుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో యూపీలో ప్రియాంకా గాంధీ ఎక్కువ పర్యటనలు చేస్తుండటంతో బీజేపీ శ్రేణులూ అలర్ట్​ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం కలిసొచ్చే పార్టీలతో పొత్తులకు సిద్ధమవుతోంది.

తాజాగా నిర్బల్ ఇండియన్​ షోషిత్​ హమారా ఆమ్​ దళ్​ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించింది. 2018 లోక్​సభ ఉప ఎన్నికలో గోరఖ్ పూర్ నుంచి ప్రవీణ్ నిషాద్ బహుజన్ సమాజ్ వాదీ, సమాజ్​వాదీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా విజయం సాధించారు. 2019 ఎన్నికలలో నిషాద్ పార్టీ బీజేపీతో జతకట్టింది.

ఇదిలా ఉంటే, సీట్ల పంపకం ఇంకా తేలలేదని, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన జితిన్ ప్రసాద, బేబీ రాణి మౌర్యలతో పాటు సంజయ్ నిషాద్ కు ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Related posts

మహాజన సోషలిస్టు పార్టీ నేత గట్ల రాజయ్యకు మాతృవియోగం

Satyam NEWS

ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ కి చక్రధర్ సిద్దాంతి

Satyam NEWS

లాక్ డౌన్: రైతుల పంటలు కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు

Satyam NEWS

Leave a Comment