40.2 C
Hyderabad
May 2, 2024 15: 44 PM
Slider జాతీయం

కోట్ల సంపద ఉన్నా.. ఆర్థిక సంక్షోభంలో అనంత పద్మనాభస్వామి

కరోనా సంక్షోభంలో భక్తులనుంచి వచ్చే ఆదాయం సరిపోక.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఆడిట్‌ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ఆలయ ట్రస్టు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఆడిట్‌ను కచ్చితంగా చేపట్టాల్సిందేనని.. వీటిని మూడు నెలల్లోనే పూర్తిచేయాలని ఆదేశించింది.

ప్రఖ్యాత పద్మనాభస్వామి ఆలయ నేలమాళిగల్లో రూ. లక్షల కోట్ల విలువైన సంపద బయటపడిన విషయం తెలిసిందే. గతేడాది సుప్రీంకోర్టు.. ఆలయంతో పాటు ట్రస్టుకు సంబంధించి గడిచిన 25ఏళ్లలో జరిగిన ఖర్చులు, ఆదాయాలపై ఆడిట్‌ చేపట్టాల్సిందిగా ట్రావెన్‌కోర్ రాజవంశం నేతృత్వంలోని ట్రస్టును ఆదేశించింది.

Related posts

రెడ్ ఎలర్ట్: కరీంనగర్ లో కరోనా పాజిటీవ్ కేసు నమోదు

Satyam NEWS

రెడ్‌క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ‌కు మ‌రో పుర‌స్కారం

Satyam NEWS

జంతువులు పక్షుల దాహం తీర్చేందుకు ఏర్పాట్లు                       

Satyam NEWS

Leave a Comment