తెదేపా ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు లోకేష్ యువ గళం ఈరోజు కుప్పం నుండి పాదయాత్ర మొదలు పెడుతున్న సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గం ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాలు మేరకు పెద్ద ఎత్తున పార్టీ సీనియర్ నాయకులు మంగళ ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమం చేసి లోకేష్ యాత్ర విజయవంతం కావాలని కోరుకున్నారు.
పూజలు చేసి అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రంగస్వామి నాయుడు సిద్ధార్థ నాయుడు ప్రతాపరెడ్డి అంజనమ్మ ఐసీ వీరేష్ యాదవ్ కృష్ణ యాదవ్ అక్బర్ బాషా తదితరులు పాల్గొన్నారు