హైదరాబాద్ శివారులోని విజయపురి కాలనీ లో కలుషిత నీరు వస్తుందన్న ఫిర్యాదు మేరకు మంగళవారం ఏ.ఎస్.రావు నగర్ కార్పోరేటర్ పావని మణిపాల్ రెడ్డి వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సమస్యలపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సమస్య ల పరిష్కారానికి ప్రణాళికను సిద్ధం చే సి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మణిపాల్ రెడ్డి డి ఈ బాలకృష్ణ డి జి యం కృష్ణ ఏఈ సంతోష్ రెడ్డి మెయింటినెన్స్ ఏఈ శ్రీనాథ్ కాలనీ ప్రెసిడెంట్ భూపతి రెడ్డి రవీందర్ రెడ్డి స్వతంత్ర రెడ్డి మధుసూదన రావు కనకదుర్గ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు