అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బీ ఎల్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం. ఉప్పల్ నియోజకవర్గం, కాప్రా సర్సీల్, కాప్రా డివిజన్లో గాంధీనగర్ లోని శ్రీశ్రీశ్రీ మైసమ్మ తల్లి ఆల యంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బీ ఎల్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంధర్బంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి