ఇటీవల క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి డాక్టర్ మల్లు రవిని నేడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. డాక్టర్ మల్లు రవి ఆరోగ్యం పై ఆయన వాకబు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రాజెక్టుల సందర్శన తదితర అంశాలను డాక్టర్ మల్లు రవి ప్రశంసించారు. పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ దిశగానే తెలంగాణ కాంగ్రెస్ పని చేస్తున్నదని ఆయన అన్నారు.