పల్నాడు జిల్లా నరసరావుపేటలో ని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ లోని శ్రీ గురజాడ వెంకట అప్పారావు కళ వేదికపై సూపర్ సండే వేడుకలు నేడు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర గ అధ్యక్షతన ఈ వేడుకలు ఉల్లాహంగా ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.
ప్రతి ఒక్కరి మానసిక ఉల్లాసం కోసం, మరీ ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, పట్టణ ప్రజలు మానసిక ఒత్తిడి ని తగ్గించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రతినెల మొదటి ఆదివారం అలాగే మూడో ఆదివారం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే.
ఈ వేడుకలలో విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగస్తులు మరియు పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సరదాగా జానపద కళా నృత్యాలు, క్లాసికల్ పాటల కు డాన్స్ లు మరియు సినిమా పాటలకు డాన్స్ లు, మిమిక్రీ మరియు వివిధ ప్రదర్శనలను చేస్తూ అందరినీ అలరించారు. కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ ఓలేటి శ్రీనివాసరావు, మున్సిపల్ అధికారులు, సచివాలయం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు వారు వివిధ కళాకారులు పాల్గొన్నారు.