38.2 C
Hyderabad
April 29, 2024 15: 01 PM
Slider ముఖ్యంశాలు

అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కోరనున్న అసెంబ్లీ పివిలేజెస్ కమిటీ

#AP Assembly

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఇద్దరు మంత్రులు ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై ఎడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని రాష్ట్ర శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ చేసిన ఫిర్యాదుపై నేటి మధ్యహ్నం మూడు గంటలకు ఏపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటి ఆన్‌లైన్ ద్వారా భేటీ అయింది.

ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. అందులో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి సహా.. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సుప్రీం కోర్టు ఆదేశాలతో పాటు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని నిమ్మగడ్డ తన లేఖలో ఆరోపించారు. మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు లక్ష్మణ రేఖ (ఎన్నికల కోడ్) దాడి తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని నిమ్మగడ్డ విమర్శించారు.

ఈ లేఖ పై స్పందించిన మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స… సీనియర్ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా బాధ్యతాయుతమై పదవుల్లో ఉన్న తమ హక్కులకు భంగం కలిగించడమే కాకుండా తమ గౌరవాన్ని దెబ్బతీసేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

ఎస్ఈసీ రాసిన గవర్నర్ కు రాసిన లేఖలో వేసిన నిందలు, ఆరోపణలు తమకు మానసికంగా వేదన కలిగించాయని, బాధించాయని. నిమ్మగడ్డ చేసిన అసత్యారోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమ గౌరవానికి భంగం కలిగిందని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని మంత్రులు కోరారు.

అడ్వకేట్ జనరల్ అభిప్రాయం వచ్చిన తర్వాతి సమావేశంలో మంత్రుల నోటీసుపై తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రివిలేజెస్ కమిటీ నిర్ణయించింది.

Related posts

IMF రుణం మంజూరు నిలిపివేత: పాకిస్తాన్ కు మరిన్న కష్టాలు

Satyam NEWS

తెలంగాణ లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ 119 సీట్లను గెలుస్తుంది

Satyam NEWS

పనులన్నీ త్వరగా పూర్తిచేయాలి 

Murali Krishna

Leave a Comment