ఛత్తీస్గఢ్తో పాటు దేశవ్యాప్తంగా పేరుగాంచిన అవిభక్త కవల సోదరులు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బలోదాబజార్లోని ఖాండా గ్రామానికి చెందిన కవల సోదరులు శివనాథ్, శివరామ్లు మరణం అందరిని కలచివేసింది. ఛత్తీస్గఢ్కు చెందిన అవిభక్త కవలలు శివరామ్, శివనాథ్ జ్వరంతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఎంతో చురుకుగా ఉండే ఈ సోదరులు అకస్మాత్తుగా మృతిచెందటాన్ని గ్రామస్థులు నమ్మలేకపోతున్నారు. బలోదబజార్ జిల్లాకు చెందిన వీరు తమ శరీర ఆకృతి, చేసే పనులతో సామాజిక మాధ్యమాలు వేదికగా లక్షలాది ఫాలోవర్స్ను సంపాదించుకున్నారు.