అఫ్గానిస్తాన్లో అధికారాన్ని హస్తగతం చేసుకొని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తాలిబన్ల చీఫ్ హైబతుల్లా అఖుంద్జాదా తొలిసారిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినప్పటికీ అఖుంద్జాదా అజ్ఞాతం వీడకపోవడంతో అతను మరణించాడని వదంతులు మొదలయ్యాయి.
వీటికి తెరదించుతూ తమ నేత కాందహార్లోని జామై దరూల్ అలూమ్ హకీమియా మదర్సాను సందర్శించినట్లు తాలిబన్లు తెలిపారు. అయితే అఖుంద్జాదా పర్యటన వీడియోలు, ఫోటోలేవీ బయటపెట్టలేదు. అతను మాట్లాడినట్టుగా భావిస్తున్న 10 నిమిషాల ఆడియోను మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేశారు.