చిరంజీవి సినిమాను తీసివేసి వేరే సినిమా ను ప్రదర్శించిన థియేటర్ యాజమన్యంపై ఆయన అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సినిమా థియేటర్ ముందు చిరంజీవి అభిమానులు పెద్దఎత్తున ధర్నా చేసి తమ నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన కనిగిరి లో శ్రీనివాసా థియేటర్ వద్ద ఈ ఘటన జరిగింది.
సూపర్ హిట్ అయిన వాల్తేరు వీరయ్య సినిమాను తీసివేసి డబ్బింగ్ సినిమా వారసుడు టికెట్ల విక్రయాలు చేయడంతో చిరంజీవి అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. చిరు అభిమాని అంజి నాయుడు ఆధ్వర్యంలో థియేటర్ వద్దకు భారీగా చేరుకుని అభిమానులు ఆందోళన నిర్వహించారు. వారసుడు టికెట్ల విక్రయాలను చిరు అభిమానులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాల్తేరు వీరయ్య సినిమా నే ప్రదర్శించాలని అభిమానులు నినాదాలు చేస్తున్నారు.